మంగళగిరిలో భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు పులివెందుల పోలీసులు. కాగా పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు.
ఈ నెల 8న ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. A1 వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.
