ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టగా.. తాజాగా సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపాడు.అయితే పవన్ కల్యాణ్ ని మామయ్య అని కాకుండా బాబాయ్ అని పిలవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.