హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు, పరిసరాల్లో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పలు రూట్లో ట్రాఫిక్ మళ్లింపు
ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతులుండవు. పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్-రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంపు వైపు వాహనాలకు అనుమతి లేదు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎస్బీఐ, గన్ఫౌండ్రీ వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలకు అనుమ తి లేదు. ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు..