రేవతి కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు మైత్రి మూవీస్ వారు. బాధిత కుటుంబాన్ని సోమవారం కలిసి ఆయన చెక్కును అందజేశారు. పుష్ప-2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో ఈ నెల 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి హీరో అల్లు అర్జున్తో పాటు సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని.. కనీసం కుటుంబాన్ని సైతం పరామర్శించలేదని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్తో పాటు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేసింది.