HomeEntertainmentబంగ్లాదేశ్ లో ..ఎమ‌ర్జెన్సీ బ్యాన్..!

బంగ్లాదేశ్ లో ..ఎమ‌ర్జెన్సీ బ్యాన్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఆ సినిమాకు తనే దర్శకత్వం కూడా వహించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం… ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు.

మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత… భారత్ – బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఎమర్జెన్సీ’ మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img