మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్ . బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మంజు వారియర్ , టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్)గా ఉండి ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఇతడు అసలు ఖురేషీ అబ్రాహం అనే అండల్ వరల్డ్ డాన్గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. మురళి గోపి ఈ సినిమాకు కథను అందిస్తుండగా.. ఇందులో మోహన్ లాల్ మరింత స్టైలిష్గా కనిపించమోతున్నాడు.