ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు ఒక కారులో అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం ఏర్పాటు చేసుకొని పేద మహిళలను టార్గెట్ చేస్తూ కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు..ఒక వేళ గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి పంపి అబార్షన్ చేయించి పైసలు వసూలు చేస్తున్నారు..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు.