బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర . ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కథానాయికగా నటి సోనాక్షి సిన్హా నటించబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ మూవీ నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.నేడు వుమెన్స్ డేని పురస్కరించుకుని ‘జటాధర నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ని విడుదల చేయగా.. ఈ ఫస్ట్ లుక్లో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.