6 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించిన వరంగల్ కేఎంసీ ఆసుపత్రి ఉద్యోగులు..వరంగల్ పట్టణంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో గత ఆరు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని, వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించిన 153 మంది నర్సింగ్ స్టాఫ్, 110 మంది పారా మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..తమ ఏజెన్సీలను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చెల్లించడంలేదని చెప్తున్నారని, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లం 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు.తమ పీఎఫ్ నిధులు కూడా యాజమాన్యం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించిన బాధిత ఉద్యోగులు.