HomeEntertainmentజైలు నుండి.. ద‌ర్శ‌న్ రిలీజ్

జైలు నుండి.. ద‌ర్శ‌న్ రిలీజ్

జైలు నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చాడు క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్. అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో . కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన జైలునుంచి విడుదలయ్యారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్‌ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img