సినిమాలు, టీవీ షోలతో బిజి బిజీగా ఉండే నటి అనసూయ తాజాగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వెళ్లింది. తన కుమారుడితో కలిసి ఎగ్జిబిషన్ లో సందడి చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తనకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసింది. అలాగే మిర్చీ బజ్జీ లాంటి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసింది. షూటింగ్, గ్రిప్ టెస్ట్ వంటి గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసింది. మొత్తానికి సామాన్యుల్లో కలిసి పోయి ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగింది అనసూయ. అనంతరం తన నుమాయిష్ విజిట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.