Homeisseseఆంధ్రప్రదేశ్ కి.. తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ కి.. తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు..బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వెల్లడించిన IMD.దీంతో ఏపీ రాష్ట్రానికి తప్పిన భారీ వర్షాల ముప్పు..అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు వర్షాలు.

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రేపటి వరకు తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం ఇంకా అలజడిగానే ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది.వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img