అనుకున్నదే జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్లోని బస్ షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్ గా మారింది. డివిజన్కు చెందిన కొందరు ఘనులు రెండు రోజుల క్రితం తమ ఆధీనంలో కి తీసుకున్నారు. షెల్టర్కు షెట్టర్ను అమర్చి ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. రూ.5 లక్షలు అడ్వాన్స్.. నెలకు రూ.25 వేలు కిరాయిగా ఒప్పందం కుదిరింది. షెల్టర్ను అద్దెకు తీసుకున్న వ్యక్తి అందులో హోటల్ వ్యాపారం మొదలు పెట్టాడు. కళ్ల ముందు ఇంతగా జరిగినా అటు ఆర్టీసీ వారు, ఇటు బల్దియా కన్నెత్తి చూడకపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే.. గత జులై నెలలో బస్ షెల్టర్ను ప్రారంభించిన నాయకుల్లో కొందరి ప్రమేయం ఉన్నదని స్థానికంగా వినిపిస్తుంది.