టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాధ, పేద పిల్లల సంక్షేమానికి ఒక మహిళ భారీ విరాళాన్ని అందించారు. అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ హోదాల్లో పని చేసిన రేణిగుంటకు చెందిన సి.మోహన.. తను పొదుపు చేసిన రూ.50 లక్షలను తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేసిన ఆమె .. ఈ నిధులను టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరారు.