మూడవరోజు నష్టాలతో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,935కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 22,913 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.65గా ఉంది.ఎన్టీపీసీ (3.32%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.01%), అదానీ పోర్ట్స్ (2.85%), టాటా స్టీల్ (1.58%), టాటా మోటార్స్ (1.33%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.35%), మారుతి (-1.81%), టెక్ మహీంద్రా (-1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.33%), ఐటీసీ (-1.06%) టాప్ లూజర్స్ గా మిగిలింది..