HomePoliticalపోల‌వ‌రం నిర్మాణానికి క‌ట్టుబ‌డి ఉన్న.. కేంద్రం

పోల‌వ‌రం నిర్మాణానికి క‌ట్టుబ‌డి ఉన్న.. కేంద్రం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఇందుకు గాను కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు. గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించింది. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ నుంచి 21మంది కూటమి సభ్యులు ఎంపీలుగా గెలిచారు. దీంతో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా కూటమి ఆవిర్భవించింది. అప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం కొత్త పథకాల మంజూరు, నిధుల కేటాయింపునకు అధిక ప్రాదాన్యం ఇస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే రూ. 12 వేల కోట్లను మంజూరు చేసింది. ఇటీవల విశాఖ స్టీల్‌ ప్లాంట్ పునరుద్దరణకు మూడు విడతలుగా మరో రూ. 11,440 కోట్లను మంజూరు చేసింది.పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కూడా హడ్కో ద్వారా సుమారు రూ. 18వేల కోట్లను రుణంగా ఆయా సంస్థల ద్వారా కేటాయించింది. జాతీయ రహదారుల నిర్మాణం, విశాఖ రైల్వే జోన్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read