దృశ్యం3పై క్లారిటీ ఇచ్చేశాడు మలయాళ నటుడు మోహన్ లాల్. తాము ఇప్పుడిక దృశ్యం 3తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని ఓ చిట్చాట్లో స్వయంగా చెప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. మేము దృశ్యం 2ను ప్లాన్ చేస్తున్నప్పుడు ఆరేళ్ల తర్వాత కోవిడ్ వచ్చింది. కానీ దృశ్యం 2 మాలీవుడ్కు కలిసొచ్చింది. ప్రపంచ నలువైపుల నుండి ఈ సినిమాలను చూశారు. రీసెంట్గా గుజరాత్లో షూటింగ్లో ఉన్నప్పుడు దృశ్యం చూసి అక్కడి వాళ్లు నన్ను గుర్తించారు. దృశ్యం 2 తర్వాత ఇతర భాషల ప్రేక్షకులు మలయాళ చిత్రాలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఈ ప్రాంచైజీ మలయాళ సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చింది. మేమిక దృశ్యం 3కి ప్లాన్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పనోరమ స్టూడియోస్, గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ అండ్ జోట్ ఫిలిమ్స్ బ్యానర్లు దృశ్యం ప్రాంఛైజీ హాలీవుడ్ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాయని తెలిసిందే. దృశ్యం 1, 2 నిర్మాతల (ఆశీర్వాద్ సినిమాస్) నుంచి అంతర్జాతీయ రీమేక్ రైట్స్ను పనోరమ స్టూడియోస్ దక్కించుకుంది. అంతేకాదు దృశ్యం సిరీస్ దక్షిణ కొరియాతోపాటు స్పానిష్ వెర్షన్లో కూడా సందడి చేయనుంది.