మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామని చెప్పారు.. తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్..రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవన్నారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుతున్నాం..అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారు .పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చింది.0%శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగాయి.20టన్స్ గాంజాయి సీజ్ చేసాం. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుంది.48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసాము .142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసాము ..5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసాం.సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడము.
180 కోట్ల నగదు బాధితులకు అందజేశము. 10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాం.ఈ ఏడాది డయాళ్ 100 కాల్స్ 16,92 వేల కాల్స్ రిసివ్ చేసామన్నారు. 7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగం.1000 పెట్రోల్ కార్స్ ఉన్నాయి..2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేసాం. రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేసాం.ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నాం..మహిళలు చిన్నారుల రక్షణ పోలీస్ బాధ్యత పోలీస్ హెల్ప్ లైన్ లో భాగంగా 29,600 ట్రాక్ చేసాం.రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నాం..18 కేసులు నమోదు చేసాం..ఇందులో 35 మంది రౌడి షీటర్ లకు కన్విక్షన్ వచ్చింది.77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడింది.