HomeEntertainmentప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు 'శ్యామ్ బెన‌గ‌ల్' క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ‘శ్యామ్ బెన‌గ‌ల్’ క‌న్నుమూత‌

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఆదివారం ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. శ్యామ్ బెనగల్ గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి మృతి చెందారని కూతురు పియా బెనగల్ తెలిపారు.శ్యామ్ బెనగల్‌ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీతో, 1991లో పద్మభూషణ్‌తో సత్కరించింది. అంకుర్, మండీ, నిషాంత్, మంథన్, జుబేదా, సర్దారీ బేగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్-ది ఫర్‌గాటెన్ హీరో తదితర సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శ్యామ్ బెనగల్ తండ్రి శ్రీధర్ బెనగల్. కర్ణాటకకు చెందిన శ్రీధర్ బెనగల్ ఫొటోగ్రాఫర్. శ్యామ్ బెనగల్‌కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయస్సులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు.శ్యామ్ బెనగల్ పది రోజుల క్రితం… డిసెంబర్ 14న తన 90వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలో నటులు కుల్‌భూషణ్ ఖర్బంద, నసీరుద్దీన్ షా, దివ్యా దత్తా, షబానా అజ్మీ, రజత్ కపుర్, అతుల్ తివారి, ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ కునాల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టులో ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విలేకరులపై దాడి కేసులో మోహన్‌బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మందస్తు బెయిల్‌ను కోరారు. మోహన్‌బాబుకు గుండె, నరాల సమస్యలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన దేశంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. మోహన్‌బాబు ఎక్కడకి వెళ్లలేదని.. మనుమరాలు పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నట్లుగా న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, మోహన్‌బాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని ఏపీపీ కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మోహన్‌బాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దిగువ కోర్టును ఆశ్రయించాలని మోహన్‌బాబుకు కోర్టు సూచించింది. ఇటీవల జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఆయనకు, పెద్ద కొడుకు విష్ణు, మనోజ్‌ గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడికి న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img