బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది. ఫార్ములా ఇ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆమోదం లభించిన తర్వాత రాజ్ భవన్ నుంమచి ప్రభుత్వానికి ఫైలు చేరినట్లు సమాచారం. ఫార్ములా ఇ రేస్ వ్యవహారంలో హెచ్ఎండీఏ కు సంబంధించిన నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా కేటీఆర్ నేరుగా నిధులను మళ్లించారని అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారని ఆరోపణలున్నాయి.