ఏపీలోని తిరుమల శారద పీఠం భవనం విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని చెప్పింది. ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఉదాహరణ కావాలని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని శారదాపీఠాన్ని ఆదేశించింది.