మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఈ రోజు కార్యక్రమాలను, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అంజనా దేవి పుట్టిన రోజును మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.