HomePoliticalసంచ‌ల‌నంగా మారిన.. రాజ‌లింగ‌మూర్తి హ‌త్య‌

సంచ‌ల‌నంగా మారిన.. రాజ‌లింగ‌మూర్తి హ‌త్య‌

తెలంగాణ జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలోజ‌రిగిన దారుణ హ‌త్య సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు.. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి.. దీంతోపాటు ఆయన అనేక ప్రజా పోరాటాలలో ముందు వరుసలో ఉంటారు.. ఆయన హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది..రాజలింగమూర్తి హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడిరోడ్డుపై జరిగింది.. రాజలింగమూర్తి బైక్ పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. మార్గమధ్యలో దాడి చేశారు.. కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు.. వారి వెంట తెచ్చుకున్న కత్తులతో అంతా చూస్తుండగానే విచక్షణ రహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా.. వ్యక్తికత కక్షలు కారణమా అనేదానిపై విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img