HomeEntertainment‘తారకరామం.. అన్నగారి అంతరంగం’..పుస్త‌కావిష్క‌ర‌ణ‌

‘తారకరామం.. అన్నగారి అంతరంగం’..పుస్త‌కావిష్క‌ర‌ణ‌

నేడు విజ‌య‌వాడ పోరంకిలోని ముర‌ళీ రిసార్ట్స్ లో నంద‌మూరి తార‌క‌రామారావు వ‌జ్రోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణతోపాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘తారకరామం.. అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్‌లింక్‌ను అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావి తరాలకు పాఠ్యాంశంగా పొందుపరచున్నట్టు జనార్దన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read