రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు.అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన తనయుడు అకీరా,ఆనందసాయి పాల్గొన్నారు.