విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.కిరండోల్-విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు.రైల్వేస్టేషన్లో బాలికల అక్రమ రవాణా గుర్తించారు.11 మందిని రెస్క్యూ చేశారు రైల్వే పోలీసులు.రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు రవికుమార్ బిసోయ్.నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమ రవాణా చేస్తున్నాడు.ఒడిశా నవరంగపూర్కు చెందిన బాలికలుగా గుర్తించారు పోలీసులు.
ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని..మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా.. ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికలను..అక్రమ రవాణా చేసిన నిందితులు..వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.