HomeEntertainmentకుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ కి.. 550 మిలియన్ల వ్యూస్

కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ కి.. 550 మిలియన్ల వ్యూస్

కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఓ వైపు నెట్టింట ట్రోల్స్ వచ్చినప్పటికీ.. మరోవైపు వాటిన్నింటినీ బీట్‌ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఈ పాటను 2024కిగాను ఇండియా అఫీషియల్‌ టాప్‌ సాంగ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట అదిరిపోయే ఫీట్‌ను నమోదు చేసింది. యూట్యూబ్‌లో కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ 550 మిలియన్ల వ్యూస్‌ సాధించి అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ పాట రిలీజ్‌ చేసిన కొత్తలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్రోల్స్ వచ్చాయి. అయితే క్యాచీ ట్యూన్‌, అదిరిపోయే స్కోర్‌, స్టన్నింగ్ కొరియోగ్రఫీ కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఖండాంతరాల్లో క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. మహేశ్ బాబు-శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ పాట గుంటూరు కారం సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img