విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దీనిపై ప్రధాని కామెంట్స్
▪️విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
▪️రూ.10వేల కోట్లు అందించాలని గురువారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం.
▪️విశాఖ ఉక్కు పరిశ్రమకు ఈక్విటీ మద్దతును అందించాలని నిర్ణయించాం.
▪️ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ సాయం అందిస్తున్నాం.
ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి..
ఇది భారీ రివైవల్ ప్యాకేజీ. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు.. పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో చర్చిస్తున్నాం. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు” అని అశ్వినీవైష్ణవ్ తెలిపారు.