అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా,యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు గారు ఘటనపై స్పందించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాధారణ కుటుంబానికి చెందిన మృతులు కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.