HomeEntertainmentతిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు 'టెంపుల్ ఎక్స్ పో'

తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు ‘టెంపుల్ ఎక్స్ పో’

నేడు తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 19 వ తేదీ వరకు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌..ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. దాదాపు 58 దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో‌ను మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్‌గా తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img