HomeDevotional2047తిరుమ‌ల విజ‌న్ లో.. అనేక కార్య‌క్ర‌మాలు..

2047తిరుమ‌ల విజ‌న్ లో.. అనేక కార్య‌క్ర‌మాలు..

తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమల ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపట్టాం అన్నారు.సిఎం చంద్రబాబు సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని ఆదేశించార‌ని వెల్ల‌డించారు.తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నామ‌న్నారు.తిరుమల పర్యటనను ప్రతి ఒక భక్తుడు అనుభూతిని గుర్తు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.అన్నప్రసాదాలు,లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాం,క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించాం..శ్రీవారి బ్రహ్మోత్సవాలు,పద్మావతి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాం అన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపాం ..


తిరుమలలో ప్రక్షాళన పది శాతం చేశాం..2047 తిరుమల విజన్ లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయాలన్నారు.
దాతలు నిర్మించిన అతిథి గృహల్లో 20 గృహాలకు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని చెప్పారు.అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాలి..అన్యమత ఉద్యోగుల బదలీపై న్యాయపరంగా వెళ్ళుతున్నాం..తిరుమలలో అనధికార దుకాణాల వల్ల భక్తులకు సమస్యలు ఏర్పడుతుంది..త్వరలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు చేప‌డ‌తాం అన్నారు.లడ్డూ ప్రసాదంకు స్వచ్చమైన నెయ్యిను వినియోగిస్తున్నాం..


..దేశ వ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయి..కన్సల్టెన్సీ ద్వారా ఆలయాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది..పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పార్కింగ్ సమస్యలు ఉన్నాయి..ఆకాశగంగ ,పాపవినాశనం తీర్థాలకు భక్తుల తాకిడి పెరిగింది..ఆ తీర్థాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో లోటు పాటులు జరిగాయి ..హిందూ ధర్మ ప్రచార కమిటీ పై లోటు పాట్లు జరగకుండా ఒక కమిటీని వేస్తున్నాం..గత ఆరు నెలలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు బాగా పని చేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read