తిరుమల తిరుపతి : ఏపీలో ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లను గురువారం టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11గంటలకు శ్రీవారి దర్శనం టోకెన్లను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.