యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్యచోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్వైడ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంది. ఈ ట్రైలర్లో హీరోలిద్దరీ అద్భుత డైలాగ్స్తో పాటు యాక్షన్ హైలైట్గా నిలిచింది. “ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను.. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరింది. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో రాబోతున్న ఈ చిత్రంలో.. హృతిక్ రోషన్ కబీర్గా తిరిగి రాగా, తారక్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.