బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఓ ప్రకటన చేసింది..పుష్ప2 టీంకి శుభాకాంక్షలు చెప్పింది.రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోతుంటాయి… కొత్త రికార్డులు వస్తుంటాయి. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. ఫైర్ నహీ… వైల్డ్ ఫైర్ (మామూలు ఫైరు కాదు… వైల్డ్ ఫైరు)” అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది. పుష్ప-2. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు రూ.1,500 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీసు చరిత్రను తిరగరాసింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. రూ.680 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో పుష్ప-2 బాలీవుడ్ దుమ్ముదులిపింది.